బిందు సేద్యం వ్యవస్థతో కలిగే ప్రయోజనాలు ఏమిటి

From Audiopedia
Revision as of 15:13, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

అనేక కారణాల వల్ల బిందు సేద్యం వ్యవస్థ అనేది స్ప్రింక్లర్లతో నీటి పారుదల లాంటి ఇతర నీటిపారుదల వ్యవస్థల కంటే మెరుగైనదిగా ఉంటుంది.

  • బిందు సేద్యం అనేది నీటిపారుదల సంబంధిత అత్యంత సమర్థవంతమైన పద్ధతి. ఇందులో, నీళ్లు నేరుగా మొక్క వేళ్ల వద్దకు చేరుతాయి కాబట్టి, వృధా తగ్గించబడుతుంది. డ్రిప్ ఇరిగేషన్‌గా పిలిచే ఈ బిందు సేద్యంలో నీటి వినియోగం అనేది స్ప్రింక్లర్లతో సహా సాంప్రదాయ నీటి సరఫరా పద్ధతుల కంటే 30 నుండి 50 శాతం తక్కువ నీటిని ఉపయోగిస్తుంది.
  • ఈ నీటిపారుదల వ్యవస్థలో తక్కువ మొత్తంలో, స్థిరమైన పరిమాణంలో నీటి సరఫరా జరుగుతుంది. కాబట్టి, చాలా మొక్కలకు అనువుగా పెరిగే పరిస్థితులు లభిస్తాయి. నీటి సరఫరా సమర్థంగా ఉండడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వేళ్ల వద్దకు నీటి సరఫరా జరుగుతుంది కాబట్టి, మొక్కలు నీటిని చక్కగా వినియోగించుకుంటాయి. తద్వారా, మెరుగైన విత్తన అంకురోత్పత్తికి, పంట దిగుబడి పెరగడానికి మరియు నీటి సరఫరా పొలం వ్యాప్తంగా ఉండదు కాబట్టి, కలుపు మొక్కలు తక్కువగా ఉంటాయి.
  • నీళ్లు మొక్కల వద్ద మాత్రమే ఉంటాయి కాబట్టి, లీచింగ్ తగ్గుతుంది. తద్వారా, ఎరువులు లేదా పోషకాల నష్టం తగ్గుతుంది. అంటే, ఎరువులను అధిక సామర్థ్యంతో ఉపయోగించవచ్చు, వ్యర్థాలను తగ్గించవచ్చు.
  • నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
  • మృత్తికలో సారంధ్రత పెరుగుతుంది.
  • ఎరువులు మరియు భూగర్భ జలాలు కలిసిపోయే పరిస్థితి ఉండదు.
Sources
  • Audiopedia ID: tel030202